end

లారీ, కారు ఢీ… నలుగురు మృతి

  • గూడూరు జాతీయ రహదారిపై ఘటన

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. తిరుపతి నుండి రాజమండ్రి వెళ్తుండగా గూడూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వీరయ్య, వరలక్ష్మీ, స్వాతి, మణికంఠ ఉన్నారు. అలాగే లిఖిత అనే యువతికి తీవ్రంగా గాయాలవడంతో దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ జాతీయ రహదారిపై బ్రిడ్జీ నిర్మాణం జరుగుతుండడంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పనులు నెమ్మదిగా సాగడం, సింగిల్‌రోడ్డులో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు గానీ, స్థానిక పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version