end
=
Sunday, July 7, 2024
వార్తలురాష్ట్రీయంపుట్టకముందే తండ్రిని కోల్పోయి.. అన్ని తానై పెంచిన తల్లీ లేకపోవడంతో..
- Advertisment -

పుట్టకముందే తండ్రిని కోల్పోయి.. అన్ని తానై పెంచిన తల్లీ లేకపోవడంతో..

- Advertisment -
- Advertisment -

గజ్వేల్‌ : తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయింది. పుట్టకముందే తండ్రిని పోగట్టుకున్న తన కూతురిని అన్ని తానై పెంచి పోశించింది ఆ తల్లీ. కూలీ నాలి చేసి తనను ఇంటర్‌ వరకు చదివించిన తన తల్లి మల్లవ్వ ఈ నెల 14న మృతి చెందింది. తల్లీ మరణించడంతో ఆ బాలిక పరిస్థిని పలువురి కంటతడి పెట్టించింది. గ్రామస్తులు ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని విచారం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం అప్పాయిపల్లి గ్రామానికి చెందిన కేశబోయిన సౌందర్య గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కళశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి అనారోగ్యానికి గురికావడంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. బాలికకు వృద్దురాలు నాన్నమ్మ ఉంది. నాన్నమ్మ బాధ్యత కూడా తోడవడంతో చదువుకోలేక ఇల్లు గడవక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమె చదువు కోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆమెకు సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -