end

1727 కిలోల గంజాయి పట్టివేత

  • లారీ కంటైనర్‌లో అక్రమంగా గంజాయి తరలింపు
  • ఛేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు
  • రూ.8 కోట్ల విలువ గల గంజాయి

భారీగా గంజాయిని తరలిస్తున్న కంటైనర్‌ ట్రక్కును మధ్యప్రదేశ్‌ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సుస్నర్‌ పట్టణంలో శనివారం జరిగింది. లారీ కంటైనర్‌లో భారీగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న నోయిడా యూనిట్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు వెంబడించి లారీని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు త్యాగి, లోకేశ్‌సింగ్‌లనుఅరెస్టు చేశారు. కంటైనర్‌ లారీలో ఉన్న 1727 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకొని లారీని సీజ్‌ చేశారు.

Also Read…

Exit mobile version