end
=
Saturday, October 5, 2024
వార్తలురాష్ట్రీయంపీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ముందా
- Advertisment -

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ముందా

- Advertisment -
- Advertisment -
  • అక్బరుద్ధీన్‌కు బండి సంజయ్‌ సవాల్‌

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం పాల్గొన్నఆయన.. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న అక్బర్ వ్యాఖ్యలను ఖండించారు. హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ నరసింహారావు సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్ అంటూ గట్టిగా అరిచాడు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీవీ అసలైన హిందువన్న ఆయన ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని తెలిపారు. వారి పట్ల చులకనగా మాట్లాడితే సహించేది లేదని సంజయ్‌ ఘాటు సమాధానమిచ్చారు.

ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారన్నారు. చేవ చచ్చి టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని, ఓ వర్గానికి మాత్రమే వారు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. హిందువులంతా కలిసి ఓటు బ్యాంకుగా మారి, బీజేపీని గెలిపిస్తే.. హైదరాబాద్‌లో అసలైన అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు బండి సంజయ్‌.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -