రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలో వివిధ రాష్ర్టాలలో భారీ నుండి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
కరోనా వైరస్ను నియంత్రించాకే వ్యాపారాలు
దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, రాయలసీమ,తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ఫలితంగా భారీ వరదలు వస్తాయని, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆయా ప్రభుత్వాలను కోరింది.
భారీగా ఉగ్రవాదుల ఆయుధాలు పట్టివేత
పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అసోం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అప్రమత్తం చేసింది.