end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంకేంద్రమిచ్చిందెంత..
- Advertisment -

కేంద్రమిచ్చిందెంత..

- Advertisment -
- Advertisment -

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెంత.. గోరంత అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో మంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆసరా పెన్షన్లు రూ.30,423 కోట్లలో కేంద్రం ఇచ్చింది రూ.1,147 కోట్లు మాత్రమేనన్నారు. కేసీఆర్ కొండంత ఇస్తే… కేంద్రం ఇచ్చింది గోరంత మాత్రమేనన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని హరీష్‌రావు పేర్కొన్నారు. బీజేపీ నేతలు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్‌ ఈ సందర్భంగా ఓటర్లకు క్లారిటీ ఇచ్చారు. కాగా, దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల ముఖ్య నేతలంతా మకాంను దుబ్బాకకు మార్చారు. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -