end

నిండు గర్భవతిని చంపిన భర్త

  • అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు

మానవత్వం మంటగలుస్తోంది. రోజు రోజుకు మనిషి కర్కషంగా తయారవుతున్నాడు. మహిళలు, ఆడ పిల్లలపై ఇంకా అఘాయిత్యాలు ఆగడం లేదు. కట్నం కోసం ఒక నిండు గర్భిణిని తన భర్తే అంతం చేశాడు. ఇదేంత దారుణ పరస్థితి. పోలీసుల తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఉంటున్న నేహ(30)కు 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్న భార్యభర్తల మధ్య కట్నం వివాదం తలెత్తింది. భర్త, అత్త మామ తరుచూ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.

మంత్రి హరీశ్‌రావుకు కరోనా

ఎన్నో బాధలు బరిస్తున్న నేహ గర్భవతి అయ్యింది. అయితే కట్టుకున్న భార్య గర్భం దాల్చిందని తెలిసి కూడా భర్త నేహను చంపేసి శవాన్ని గంగానదిలో పడేశాడు. తన కూతురు ఇంట్లో కనిపించడం లేదని నేహ తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భర్తను, అత్తమామను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చెపట్టారు. దీంతో అసలు విషయం వెల్లగక్కారు. తామే నేహను చంపి అనవాళ్లు కనిపించకుండా శవాన్ని గంగానదిలో పడేశామని ఒప్పుకున్నారు. దీంతో నేహ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సెప్టెంబర్‌ 7 నుండి హైదరాబాద్‌ మెట్రోరైళ్లు

పోలీసులు భర్త, అత్త మామలతో పాటు నేహను చంపడానికి సహాయపడిన మరో ఇద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. నేహ మృతదేహం కోసం గంగానది, పరివాహక ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ తెలిపారు.

చెన్నై – విజయవాడ విమాన సర్వీసు

Exit mobile version