end

కామన్వెల్త్‌లో చరిత్ర సృష్టించిన భారత్

టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత భారత్‌కు చెందిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు సృష్టించింది. మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో అత్యధిక బరువు మొదటిస్థానంలో నిలిచింది. చాను స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 109 కిలోలు ఎత్తింది. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత భారతదేశానికి చెందిన ఈ స్టార్ వెయిట్‌లిఫ్టర్ స్నాచ్‌లో కామన్వెల్త్ గేమ్ రికార్డును సృష్టించింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల వెయిట్ విభాగంలో ఈ ఘనత సాధించింది. స్నాచ్‌లో చాను తన తొలి ప్రయత్నంలోనే 84 కేజీలు ఎత్తింది. రెండో ప్రయత్నంలో 88 కేజీల బరువు ఎత్తి అత్యుత్తమాన్ని సమం చేసింది. మూడో ప్రయత్నంలో 90కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించినా విఫలం అయింది.

మీరాబాయి తన తొలి ప్రయత్నంలోనే క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని ఖాయం చేసుకుంది. రెండో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 114 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయింది.టోక్యో ఒలింపిక్స్‌లో స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోలు మీరాబాయి చాను అవలీలగా ఎత్తి స్వర్ణం దక్కించుకుంది. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌ 55కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ రజతం, 61 కేజీల కేటగిరిలో గురురాజ క్యాంసం గెలిచారు. దీంతో భారత్‌ మూడు పతకాలను ఖాతాలో వేసుకుంది.

Exit mobile version