end

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి

  • హైదరాబాద్‌ హెచ్‌ఎంటినగర్‌లో ఘటన
  • రూ. 10లక్షలు, 18 తులాల బంగారం చోరి

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు

హైదరాబాద్‌ : వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన హైదరాబాదులోని నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెచ్‌ఎంటినగర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లగా వృద్ధురాలు ఒక్కత్తే ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన నేపాల్‌కు చెందిన పనిమనుషులు ఆ వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఇంట్లో ఉన్న రూ.10 లక్షలతో క్యాష్‌తోపాటు 18 తులాల బంగారం నగలు చోరీ చేశారు.

దసరా పండుగకు TSRTC ప్రత్యేక బస్సులు

తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. అనంతరం నేపాల్‌ పనిమనుషులను ఏర్పాటు చేసిన ఏజెన్సీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చెన్నై ఢమాల్‌.. రాజస్తాన్‌ ఘనవిజయం

Exit mobile version