end

కోహ్లి మరో అరుదైన రికార్డు

రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభమైన నుంచి కింగ్‌ కోహ్లి బెంగళూరు జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా, ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్‌ బాదిన కోహ్లి.. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ క్లబ్‌లో చేరాడు. ఈ క్లబ్‌లో కేవలం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే ఉన్నారు. వారిలో క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌, ధోని, రోహిత్‌ శర్మ, కోహ్లి ఉన్నారు. ఐపీఎల్‌ చరిత్రలో 200 సిక్సర్లతో పాటు 500 ఫోర్లు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు.

Exit mobile version