end

కొమురవెళ్లి గుడి మూసివేత

నాలుగు రోజుల పాటు కొమురవెళ్లి మల్లన్న గుడి మూసివేస్తున్నారు.  ఇటీవల ఆలయ అర్చకులకు, సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆలయాన్ని మూసివేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.  కరోనా కొమరవెళ్లి చుట్టూ గ్రామల్లో  విజృంభిస్తున్న తరుణంలో గుడిని 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గర్భగుడిలో యాదవిధిగా పూజలు జరుగుతాయని, భక్తులకు ఎలాంటి అనుమతులు ఉండవని ఆలయ ఈవో వెంకటేశ్‌ తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

Exit mobile version