end

రైలు ప్రమాదం… ఐదు మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం నుండి పలాస వైపు వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ టెక్నికల్‌ కారణాల వల్ల జి సిగడాం మండలం బాతువ రైల్వేగేట్‌ వద్ద నిలిచిపోయింది. దీంతో కొందరు ప్రయాణీకులు పట్టాలపైకి వచ్చారు. అప్పుడే అటుగా వచ్చిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణీకులను ఢీకొట్టింది. దీంతో ఆ పట్టాలపై ఉన్న ఐదు మంది ప్రయాణీకులు మరణించారు. ఘటనా స్థలానికి రైల్వే సహాయక బృందాలు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరణించిన ప్రయాణీకుల వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version