end

ఉచిత తాగునీటి పథకం ప్రారంభం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్‌ యూసఫ్‌గూడలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద నగరవాసులు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా పొందనున్నారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అత్యధిక కార్పోరేటర్ల స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌.. తన తొలి హామీని లాంఛనంగా నెరవేర్చనుంది.

Exit mobile version