end

సైనికులకు సెల్యూట్‌గా ఓ దీపం వెలిగిద్దాం

నిరంతరం దేశ సరిహద్దుల్లో ఉంటూ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికులకు ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే. వారి సేవలకు సెల్యూట్ చేస్తూ.. వారి గుర్తుగా ఓ దీపం వెలిగిద్దామని ప్రధాని నరేంద్ర మోది పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. దేశం కోసం సైనికులు చేసే త్యాగాలు వర్ణించలేమన్నారు. ఈ దీపావళి పర్వదినాన ప్రతి ఇంటి ముందు ఓ దీపం వెలిగించి.. సరిహద్దుల్లో ఉన్న సైనికులకు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు చెబుదామని ప్రధాని ట్వీట్ చేశారు. మరి ప్రధాని మాటను నిజం చేసి, సైనకులకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు చెబుదామా..!

Exit mobile version