end
=
Friday, September 20, 2024
సినీమాలైగర్ మూవీ ట్రైలర్ లాంచ్…
- Advertisment -

లైగర్ మూవీ ట్రైలర్ లాంచ్…

- Advertisment -
- Advertisment -

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్ విడుదలైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లే రౌడీ స్టార్‌ను ఓ రేంజ్ లో చూపించాడు డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. రౌడీ స్టార్ ఇది పక్కా నెక్స్ట్ లెవల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఇంటెన్స్‌తో సాగింది.

ఒక లయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు క్రాస్ బీడ్ సార్ వాడు. అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ బిగిన్ అవుతుంది. విజయ్ దేవరకొండ యాక్షన్, మదర్ సెంటిమెంట్, బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే బీజీఎం, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు, గ్యాంగ్ వార్స్, అనన్య పాండేతో లవ్ సీన్స్, చివరలో మైక్ టైసన్ ఎంట్రీ. మొత్తంగా లైగర్ ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఒకరకంగా ఫ్యాన్స్‌కు ఇది మంచి ఫుల్ మీల్ అన్నట్లుగా ఉంటుంది.

ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ నుంచి రెండే రెండు డైలాగ్స్ వినిపించాయి. ఒకటి ‘ఐలవ్యూ’.. రెండోది ‘ఫైటర్’. ఈ రెండు డైలాగ్స్ చెప్పేటప్పుడు విజయ్ దేవరకొండ నత్తిలా కనిపిస్తాడు. బహుశా సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌కి నత్తి ఉంటుందేమో..! ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ మేకింగ్‌లో ఫ్రెష్‌నెస్ కనిపించింది. పూరి తన గత చిత్రాలకు చాలా భిన్నమైన మేకింగ్ స్టైల్‌ను ఫాలో అయినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ నేపథ్యంలో ఉదయం నుంచే రౌడీ ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ లో విజయ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్‌కే ఇంత సెలబ్రేషన్సా కొందరు షాకవుతుంటే విజయ్ అన్న అంటే ఆమాత్రం ఉంటుందని ఫ్యాన్స్ బదులిస్తున్నారు. మొత్తంగా విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు లైగర్ ఫీవర్‌తో ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికే థియేటర్ వద్ద 75 అడుగుల భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. విజయ్ కటౌట్ కు పాలాభిషేకం, పూలాభిషేకం చేస్తున్నారు ఫ్యాన్స్. డప్పులతో టపాసులతో థియేటర్ దగ్గర ఒక పెద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేయనున్నారు. లైగర్ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -