end

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు కింద పడి ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు. అసెంబ్లీ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మరళీ కృష్ణ ప్రమాదవశాత్తు బస్సు వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మురళీ కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version