end

ఉదయ్‌పూర్‌ బయల్దేరిన మెగా ఫ్యామిలీ

టాలీవుడ్‌ హీరోయిన్‌, నాగబాబు ముద్దుల తనయ పెళ్లికి సిద్దమైపోయింది. ఇన్నాళ్లు సినిమాలు, టీవి షోలతో బిజీగా గడిపిన నీహ.. మొత్తానికి ఓ ఇంటికి కోడలు కాబోతోంది. కొన్ని రోజుల క్రితమే చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కాగా, వీరి వివాహం డిసెంబర్‌ 9న ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ బయల్దేరారు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. నిన్ననే హైదరాబాద్‌లోని వారి నివాసంలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం కూడా జరిగింది. నిహారికా ఇంటిని పూలు, లైట్లతో అందంగా ముస్తాబు చేశారు.

ఎవరీ చైతన్యా..?
చైతన్య జొన్నలగడ్డ గుంటూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్ ప్రభాకర్‌ రావు తనయుడు. అతను హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. చైతన్య గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ బిట్స్‌ పిలానీలో పూర్తి చేశాడు.

కాగా, ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోంది. నిహా తల్లిదండ్రులు, సోదరుడు వరుణ్‌ తేజ్‌, రామ్‌ చరణ్, ఉపాసన, శ్రీజ, కళ్యాణ్‌దేవ్‌, అల్లు అరవింద్‌ దంపతులు, అల్లు అర్జున్‌, ఆయన సతీమణి, పిల్లలు.. ఇలా అందరూ ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్‌ బయల్దేరారు. చైతన్య కుటుంబీకులు కూడా ఉదయ్‌పూర్‌ బయల్దేరారు.

Exit mobile version