end

ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఏమీ బాగాలేదు. ప్రజలు ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకులీడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ తూటాలు గుచ్చుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. తాజాగా ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడికి యత్నించారు.

ప్రణబ్‌ ముఖర్జీ ఇకలేరు

బారాముల్లా నుండి శ్రీనగర్‌ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై గ్రెనెడ్లతో డాడులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు అవి కాన్వాయ్‌ వాహనాలమీద గాకుండా రోడ్డుపై వెళుతున్న స్థానికులపై పడ్డాయి. దీంతో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా శ్రీనగర్‌ ప్రజలకు ఉగ్రవాదుల నుండి ఎప్పుడూ ముప్పు ఉంటూనే ఉంది.

బస్తాలకొద్ది అంబర్ ప్యాకెట్లు…!

Exit mobile version