end
=
Friday, July 5, 2024
వార్తలురాష్ట్రీయందుబాయ్ ఎయిర్ పోర్ట్ లో రవిని కలిసిన మంత్రి
- Advertisment -

దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో రవిని కలిసిన మంత్రి

- Advertisment -
- Advertisment -

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ను పరిశీలించటానికి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రావు, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ అల్లపురం వెంకటేశ్వర రెడ్డి గార్ల బృందం ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ కు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు.ఈ పర్యటన లో మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో వెళ్తున్న బృందం కామన్వెల్త్ మెగా టోర్నీ నిర్వహణ, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన పై అధ్యాయనం చేయనున్నారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యాయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారు. కామన్వెల్త్ గేమ్స్ ను పరిశీలించటానికి ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ కు వెళ్తున్న రాష్ట్ర మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి బృందానికి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర క్రీడా పాఠశాల కు చెందిన క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, స్పోర్ట్స్ స్కూల్ OSD డా. హరికృష్ణ, క్రీడా శాఖ అధికారులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. టోక్యో – 2020 ఒలింపిక్స్ లో రెస్లింగ్ క్రీడలో ఫ్రీ స్టయిల్ 57కే‌జి విభాగంలో కాంస్య పతకం ను సాధించిన రవి కుమార్ దహియా దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో కలిశారు. అనంతరం కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న బర్మింగ్ హామ్ కు ఒకే విమానంలో కలసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన మాదిరిగా కామన్వెల్త్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -