end

ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకూతురు..

-పోలీసుల అదుపులో భర్త
కొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తల్లీకూతుళ్ల మృతదేహాలను తండావాసులు గుర్తించి, పోలీసులకు సమాచామందించారు. కుటుంబ కలహాల వల్లే తల్లీ కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తండావాసులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల వివరాల మేరకు.. 4 సంవత్సరాల క్రితం రాజు, స్వర్ణ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహానంతరం దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజులుగా రాజు కట్నం కోసం స్వర్ణను తరచూ వేధిస్తున్నట్లు, గొడవలు చేస్తున్నట్లు స్వర్ణ బంధువులు ఆరోపిస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్ విచారణ ప్రారంభించారు. కోడిచర్ల తండాకు చెందిన స్వర్ణ , ఆమె ఏడాదిన్నర చిన్న కూతురు మధుశ్రీ ఇద్దరు ఒక క్వారీ గుంతలో విగతజీవులుగా శవాలై తేలారు. క్వారీలో పడిన తల్లీకూతుళ్ల శవాలను గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలి భర్త రాజుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Exit mobile version