- న్యూమోనియా సోకినట్లు డాక్టర్ల నిర్ధారణ
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు
- తగ్గిన ఆక్సిజన్ లెవల్స్, పరిస్థితి విషమం
విద్యుత్షాక్తో కుటుంబ సభ్యులు దుర్మరణం
కరోనా వైరస్ వల్ల తెలంగాణ రాష్ర్ట మాజీ హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చింది కానీ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో ఆయనకు న్యూమోనియా సోకినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వెంటనే నర్సింహ్మారెడ్డిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. దీనికితోడు ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయాయని పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుందని డాక్టర్లు వెల్లడించారు. అయితే నర్సింహ్మారెడ్డితోపాటు ఆయన సతీమణి అహల్యకు కూడా కరోనా పాజిటివ్ తెలడంతో ఆమెను మరో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.