end

దేశానికి నేతాజే ప్రేరణ..

  • ప్రధాని నరేంద్ర మోదీ

కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశ ధైర్య సాహసాలకు ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన కోల్‌కతాలో125వ జయంతి సందర్భంగా జరిగిన ‘పరాక్రమ దివస్‌’ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. నేతాజీ భారతదేశ ధైర్యానికి, పరాక్రమానికి ప్రేరణ అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఆ మహానీయుడి కృషిని గుర్తించుకోవడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ దిశా నిర్దేశం చేశారని కొనియాడారు. సుభాష్‌ చంద్రబోస్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Exit mobile version