end

ఏపీలో న్యూ ఇయర్‌ వేడుకలు నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించింది. రాష్ట్రంలో డిసెంబర్‌ 31, జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు రద్దు చేసింది. ఆ రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి కేంద్ర వైద్య నిపుణుల సూచనల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 26 నుంచి జనవరి 1వరకూ అన్ని రకాల వేడుకలు రద్దు చేస్తారు. వైన్స్‌‌, బార్ల సమయాన్ని కుదిస్తారు. విద్యా సంస్థలకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేస్తారు.

Exit mobile version