end

సీఎం ప‌ద‌వికి నితీష్ రాజీనామా

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకొని తన రాజీనామా లేఖ గవర్నర్‌ ఫగ్‌ చౌహాన్‌ను అందించారు. పాదయాత్రగా వెళ్లి రాజీనామా చేస్తారని మీడియాలో ప్రచారం చేసిన అలా జరగలేదు. రాజ్‌భవన్‌కు ఒంటరిగానే చేరుకుని రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందించారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీయే నుంచి వైదొలగాలని ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరిలో ఏకాభిప్రాయం ఉందన్నారు. తనకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. రాజీనామా అనంతరం ఎన్డీయే నుంచి వైదొలిగినట్లు నితీశ్ ప్రకటించారు.

అంతకుముందు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ అవమానానికి గురిచేస్తోందని జేడీయూను అంతమొందించేందుకు కుట్ర చేశారు అని అన్నారు. 2020 నుంచి ప్రస్తుత కూటమి తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని సీఎంకు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకపోతే పార్టీకి మేలు జరగదని సీఎం అన్నారు. తేజస్వియాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జేడీయూ ఎంపీలు , ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు నితీష్‌కుమార్‌.

Exit mobile version