end

62కు చేరిన ఒమిక్రాన్‌ బాధితులు

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు కొత్తంగా 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 62కు చేరింది. అయితే 62 మంది ఒమిక్రాన్‌ కేసుల్లో 46 మంది బాధితులు వ్యాక్సిన్‌ తీసుకోలేదని వెల్లడించారు. ఎటువంటి ప్రయాణాలు చేయనటువంటి ల్యాబ్‌టెక్నీషియన్‌, ఒక గర్భిణి మహిళ, ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. కాగా విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందికి స్ర్కీనింగ్‌ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Exit mobile version