end

అప్పుడే టీపీసీసీ అధ్యక్షుడి నియామకం

తెలంగాణ కాబోయే పీసీసీ అధ్యక్షుడు ఎవరనే చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసే వరకూ ప్రస్తుత పీసీసీ కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్, రేవంత్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ఉప ఎన్నిక తర్వాతే నూతన పీసీసీని నియమించాలని ఇప్పటికే అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. ఈలోపే పీసీసీ విషయంలో తర్జనభర్జన, రోజుకో పేరు తెరపైకి రావడం పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నిక తర్వాతే పీసీసీని నియమించాలన్న నిర్ణయానికొచ్చింది.

Exit mobile version