end
=
Wednesday, September 18, 2024
వార్తలుజాతీయంబాణాసంచా పేలి ఆరు మంది మృతి
- Advertisment -

బాణాసంచా పేలి ఆరు మంది మృతి

- Advertisment -
- Advertisment -

బాణాసంచా పేలి ఆరు మంది మృతి చెందిన దుర్ఘటన బీహార్‌లోని సరాన్‌ జిల్లా ఖైరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖుదాయిబాగ్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యాపారి ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇల్లు కుప్పకూలగా సగభాగం పూర్తిగా కాలిపోయింది. ఇంటి శిథిలాలకింద కొంత మంది చిక్కుకుపోగా వారిని సహాయక బృందాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్‌, బాంబు డిస్పోజల్‌ బృందాలకు సమాచారం అందించినట్లు జిల్లా ఎస్పీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. సుమారు గంటపాటు బాణాసంచ పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -