end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంపోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు
- Advertisment -

పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు

- Advertisment -
- Advertisment -
  • ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి
  • తుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన చర్ల గిరిజన ప్రాంతం

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులతో మరోసారి పరిసర ప్రాంత గిరిజన ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతలో మావోయిస్టులు మందు పాతర పేల్చారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చర్ల మండలం పడివాగు వద్ద జరిగినట్లు పోలీసలు వర్గాలు వెల్లడించాయి. అయితే పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది.

రెండో విడద స్వచ్ఛంద VRS

గత కొన్ని రోజులుగా అరణ్యంలో మావోల కదలికలు కనిపిస్తున్నాయన్న అనుమానంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. మాజీ నక్సలైట్ల మీద కూడా నిఘా వేశారు. కాగా, దేవర్లపూడి ఎన్‌కౌంటర్‌కి నిరసనగా శబరి ఏరియా కమిటీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈఎన్‌కౌంటర్‌కి ప్రతీకారంగా మావోయిస్టులు ఏదై నా ఘాతుకానికి పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు

రెండు రాష్ట్రాల సరిహద్దులోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించలేదు.

ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -