end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంపార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్దం
- Advertisment -

పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్దం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగుతానని ప్రముఖ నటి, రాజకీయ నేత విజయశాంతి అన్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తనకు మధ్య వ్యక్తిగత వైరం లేదని విజయశాంతి అన్నారు. ఇటీవల విజయశాంతి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకునే ఆసక్తిలేదు. కేసీఆర్ నిరంకుశ విధానాల వల్లే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఆర్థిక సహాయం చేశా. ఆ డబ్బులు దారి మళ్లాయి. కేసీఆర్ అవినీతిని మా పార్టీ వదిలిపెట్టదు. మొత్తం బయటపెడతాం. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ మాట తప్పలేదు’ అని ఈ సందర్భంగా విజయశాంతి అన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -