end

పబ్‌లకు అనుమతి

వెబ్‌ డెస్క్‌ : కేంద్ర ప్రభుత్వం సడలింపులతో ప్రకటించిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానుండగా మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్‌ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్‌ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని, అయితే వాటి సీటింగ్‌ సామర్థ్యంలో సగం ఖాళీగా ఉంచాలని ఎక్సైజ్‌ మంత్రి హెచ్‌ నాగేష్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో, భౌతిక దూరం పాటిస్తూ, నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కాగా కరోనా నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1435 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.  మద్యం విక్రయాలకు అనుమతించని పక్షంలో నష్టాలు 3000 కోట్ల రూపాయలు దాటతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక ప్రభుత్వం వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతించింది.

Exit mobile version