end

సీపీకి రాజాసింగ్‌ సవాల్‌

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు. బహుదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్న వీడియోలను రాజాసింగ్ బయట పెట్టారు. నిన్న రాజాసింగ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మీకు చేత కాకుంటే అనే పదాన్ని తాను ఉపయోగించవచ్చని… కానీ కమిషనర్‌పై తనకు గౌరవం ఉందన్నారు. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదని, అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజసింగ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Exit mobile version