end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంత్వరలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌లు..
- Advertisment -

త్వరలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌లు..

- Advertisment -
- Advertisment -

అతి త్వరలోనే రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్‌ను లాంచ్ చేస్తారని కేసీఆర్ వెల్లడించారు.

ఆదివారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ ధరణి పోర్టల్’ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతుందన్నారు. రైతుల నుంచి కూడా అద్భుతమైన ప్రతిస్పందన వస్తుందన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని సీఎం వివరించారు.

‘ధరణి’ ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని, నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నదని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. సమస్యలు చక్కబడినాకే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నమని సీఎం తెలిపారు. అందుకే కొన్ని రోజులు వేచి చూశామన్నారు.

నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ‘ధరణి పోర్టల్’ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -