- ప్రాజెక్టులు, ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్ భూముల స్వాధీనం
తెలంగాణ రాష్ర్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలు జరిగాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థను యదాతథంగా కొనసాగించాలని విన్నవించారు.
అయితే గ్రామాలలో వీఆర్వోల అరచకాలు పెట్రేగిపోవడం వల్ల కేవలం వీఆర్వో వ్యవస్థను మాత్రమే రద్దు చేస్తున్నామని, మిగతా రెవెన్యూ వ్యవస్థ యదావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో అన్ని రికార్డులు అందుబాటులో ఉంటాయని సీఎం వివరించారు.
డిగ్రీ, పీజీ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించవచ్చా?
ఇవేగాకుండా సర్వే సెటిల్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుందన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రాజెక్టులు, ప్రజల అవసరాల నిమిత్తం మాత్రమే ప్రభుత్వం అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు.