- ఇతర దేశాల పౌరులను తరలించేందుకు అవకాశం
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న వేళ సాధారణ పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించడం కోసం తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్లోని వోల్నవోఖ్, మరియుపొల్ నగరాలను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించాయి. ఇతర దేశాల నుండి వస్తున్న అభ్యర్థనలు, డిమాండ్ల కారణంగా ఆయా నగరాల్లో ఉన్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ తాత్కాలికంగా కాల్పుల విరమణ ఇచ్చినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. అయితే మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుండి రష్యా దళాలు కాల్పులు నిలిపివేస్తాయని రక్షణశాఖ అధికారులు తెలిపారు.
![](https://www.telugu24.in/wp-content/uploads/2022/03/russia-war-1024x569.jpg)