end

స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాలు పెంపు

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • మార్చి 1 నుండి వేతనాల వర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజిన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్ల వేతనాలు పెరిగాయి. దీనికి సంబంధించిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు 30 శాతం నుండి 50 శాతం వరకు వేతనాలు పెరిగాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకంగానే వేతనాలను ప్రభుత్వం పెంచింది. మార్చి 1 నుండి ఈ వేతనాలు వర్తిస్తాయని ఉత్తర్వులో ఉంది. స్పెషలిష్టు డాక్టర్లకు 50శాతం, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జెన్‌లకు, డీఏఎస్‌లకు 30శాత మేర వేతనాలు పెంచబడ్డాయి.

Exit mobile version