- రూ.2,170 కోట్ల ఆదా చేయనున్న SBI
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ విడద స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఎస్బిఐ సంస్థ ఖర్చులను తగ్గించుకునేందుకు దాదాపు 30 వేల మంది ఉద్యోగులను VRS ద్వారా ఇంటికి పంపించనుంది. దీని కోసం ముసాయిదా పథకం సిద్దం చేసి బోర్డు అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.
ఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు
‘సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్-2020’ పేరుతో ఒక డ్రాఫ్ట్ సిద్దం చేసిందని బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తుందని, ఆమోదం రాగానే డిసెంబర్ 1 నుండి ఫిబ్రవరి వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది. కటాఫ్ తేదీనాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, బ్యాంకు సిబ్బందికి ఇది వర్తిస్తుంది. అయితే 11,565 మంది అధికారులు, 18,625 మంది బ్యాంకు సిబ్బంది వీర్ఎస్ తీసుకోవాల్సిందే. తద్వారా సుమారు 2,170 కోట్ల రూపాయలను సంస్థ ఆదా చేయవచ్చని ఎస్బిఐ ఆశిస్తోంది.
ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు
ఇదిలావుండగా స్వచ్ఛందగా … తీసుకునే ఉద్యోగులకు మిగిలిన కాలానికి 50 శాతం జీతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గ్రాట్యుటీ, పెన్షన్, పి.ఎఫ్, మెడికల్ బెనిఫిట్స్ ప్రయోజనాలను అందించనుంది.