end

శార్దూల్‌, సుందర్‌ అర్ధ సెంచరీలు

బ్రిస్బేన్‌: క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిరువురూ ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. సుందర్ 108 బంతుల్లో 50 పరుగులు చేస్తే, శార్దూల్‌ 90 బంతుల్లో (50) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్‌కు ఇది తొలి టెస్ట్ హాఫ్ సంచరీ. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో బౌలర్లు ఇద్దరూ వికెట్లకు అడ్డుపడి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంపై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శార్దూల్‌ను కమ్మిన్స్‌ ఔట్ చేశాడు. ప్రస్తుతం సుందర్‌(139 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్‌), నవదీప్‌ సైనీ(5) క్రీజులో ఉన్నారు. 107 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది.

Exit mobile version