end

మహిళపై ఆరుగురు లైంగికదాడి

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. 26 ఏళ్ల మహిళపై ఆరుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గత సోమవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐపీఎల్‌ 2020కి జేసన్‌రాయ్‌ దూరం

పోలీసులు వివరాల ప్రకారం ఒక మహిళా తన సోదరికి వైద్యం నిమిత్తం నిజామాబాద్‌కు తీసుకొచ్చింది. అయితే సదరు మహిళకు ఆర్థిక సహాయం చేస్తామని ఆరు మంది వ్యక్తులు నమ్మబలికి అదే రోజు రాత్రి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అర్థరాత్రి వరకు యువకులు ఆమెను తమ వద్దే ఉంచుకోగా మంగళవారం 1:30 గంటల సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అటుగా రావడంతో ఆరుగురు నిందితులు మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు.

నమ్మించి వంచించి…

అనంతరం ఆ మహిళా జరిగిన సంఘటన గురించి వివరించడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఈ ఆరుగురిలో ఇద్దరు మైనర్లను జ్యువైనైల్‌ హోంకు పంపించారు.

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

Exit mobile version