end

పదో తరగతి ఫలితాలు విడుదల

  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను https://bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయనందున విద్యార్థులు తాము చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, అలాగే పుట్టిన తేది వివరాలను వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని వివరించారు. 2,10,647 మంది విద్యార్థులు 10 జీపిఎ సాధించినట్లు మంత్రి తెలిపారు. ఈ గ్రేడ్‌లను ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయించినట్లు తెలిపారు. వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించిన 5,21,393 మంది విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు ఆమె వివరించారు.

మే 30 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

ఆర్టీసికి రోజుకు రూ.12 కోట్ల నష్టం

Exit mobile version