మహేశ్ మెచ్చిన మాటల రచయిత!
మహేశ్బాబు, రాజమౌళి (SSMB29)కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్(Working Title)తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కోసం దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ కేటాయిచినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు ఇందులో భాగం కాబోతున్నారు. మొదట్నుంచీ పాన్ వరల్డ్ లెవల్లో సినీప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న ఈ ప్రాజెక్టు గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో వైరల్గా మారుతోంది. తాజాగా ఈ సినిమా డైలాగ్ రైటర్ గురించి ఆసక్తికర వార్త విషయం ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు దేవ కట్టా(Director Deva Katta) మాటలు రాస్తున్నాడట. ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు ఎం రత్నం మాటలు రాసేవారు. రాజమౌళి సోదరుడు కంచి కూడా డైలాగ్స్ అందించారు. ‘ఆర్ఆర్ఆర్’కు సాయిమాధవ్ బుర్రా మాటల రచయితగా పనిచేశారు. ‘బాహుబలి1’లో యుద్ధం సీన్లో వచ్చే ‘ఏది మరణం..’ డైలాగ్(Dialogue Writer)ను దేవ కట్టానే రాశారని టాక్. తన సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉండాలనే ఉద్దేశంతోనే మహేశ్బాబు.. స్వయంగా దేవ కట్టా కావాలని కోరినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘వెన్నెల’ చిత్రంతో దర్శకుడిగా మారిన దేవ కట్టా.. తర్వాత ‘ప్రస్థానం’తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. నాగచైతన్యతో ‘ఆటోనగర్ సూర్య’ తీశారు. చివరిగా సాయిదుర్గాతేజ్తో చేసిన ‘రిపబ్లిక్’ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టలేకపోయింది. చురకత్తుల్లాంటి డైలాగ్స్ రాయడంలో దేవ కట్టాది పెట్టింది పేరు. ఇప్పుడు మహేశ్ సినిమాకు మాటలు రాస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రాజమౌళి తండ్రి వీ విజయేంద్రప్రసాద్ చెప్పినట్టు ప్రకారం ఇది ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ అయినప్పటికీ.. ఇందులో యాక్షన్ సన్నివేశాలతోపాటు డైలాగ్స్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తోంది.