end

ఐపీఎల్ (2020)‌కు సురేశ్‌ రైనా దూరం

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి షాక్‌

ఐపీఎల్‌ 2020కి సిద్దమవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. చెన్నై ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా తన వ్యక్తిగత కారణాల వల్ల ఐపిఎల్‌ 2020 సీజన్‌ మొత్తానికి దూరంగా ఉండనున్నట్లు టీమ్‌ సీఈఓ కె.ఎస్‌.విశ్వనాథన్‌ ప్రకటించారు.

ఐపీఎల్‌ 2020కి జేసన్‌రాయ్‌ దూరం

‘సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌కు తిరిగొచ్చేశాడు. ఈ సీజన్‌ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడు. ఈ సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సురేశ్‌ రైనాతో పాటు అతని కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటుందని’ చెన్నై ఫ్రాంఛైజీ పేర్కొంది. చెన్నై జట్టులో ఇప్పటికే 10 మంది సభ్యులకు కరోనా వైరస్‌ సోకినట్లు తెలిసింది.

మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌

‘నా కెరీర్‌ ముగింపుకు వచ్చింది’

Exit mobile version