end

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు సీబీఐ చేతికి

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం అందరిని కలిచివేసింది. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే సందేహం పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణం కేసులో బీహార్‌లోని పాట్నాలో నమోదైన కేసును అక్కడి నుంచి ముంబై తరలించాలని కోరుతూ నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బుధవారం ఉదయం సీబీఐ దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ హృషికేష్ రాయ్ ఉత్తర్వులు జారీచేశారు. సుశాంత్ మరణానికి సంబంధించి ఇంకేవైనా ఎఫ్ఐఆర్‌లు నమోదైనా వాటిని కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Exit mobile version