end

ACB Raid : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇన్‌చార్జి తహశీల్దార్‌

ACB raids in ramareddy
  • రైతు వద్ద 4వేల లంచం తీసుకుంటున్న రామారెడ్డి తహశీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌

Kamareddy : రెవెన్యూ అధికారులు(Revenue Tahasildar) రైతు వద్ద లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ(ACB) పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి (Ramareddy Mandal) మండలం ఇన్‌చార్జి తహశీల్దార్‌ మానస (Manasa), కంప్యూటర్‌ ఆపరేటర్‌ లక్ష్మణ్‌ (Computer Operator Lakshman) వ్యవసాయ భూమి మార్పు(Land Shift) చేయాలని కోరిన రైతు బలరాం(Farmer Balaram) వద్ద 5వేల లంచం(Five thousand Bribe Demand) డిమాండ్‌ చేశారు. ఏసీబీ డీఎస్పీ ఆనందర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం… రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు బలరాం తన పెద్దమ్మ పేరు మీద ఉన్న 30 గుంటల వ్యవసాయ భూమిని తన పేరుపై మార్పు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు.

(Mahalakshmi : సంకల్పం నెరవేరేందుకు…)

ఇన్‌చార్జి తహసీల్దార్‌ మానస, ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్‌ లక్ష్మణ్‌ను పలుమార్లు మార్చాలని కోరారు. అయితే ఈ పనికి ఆన్‌లైన్‌ ఫీజు(Online Fee) రూ.4 వేలు, అదనంగా మరో రూ.5 వేలు లంచం ఇవ్వాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ డిమాండ్‌ చేశారు. రూ.5 వేలు ఇచ్చుకోలేనని రైతు చెప్పగా, రూ.4 వేలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో రైతు బలరాం ఏసీబీ అధికారులను సంప్రదించగా రెడ్‌ హ్యాడెండ్‌గా(caught red-handed) పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

(Munugode by Elections : ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు)

Exit mobile version