end
=
Thursday, September 19, 2024
వార్తలుజాతీయంతమిళనాట కొత్త రాజకీయం..
- Advertisment -

తమిళనాట కొత్త రాజకీయం..

- Advertisment -
- Advertisment -

చెన్నై : తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హసన్, ఎంఐఎం పార్టీతో పొత్తుకు సిద్ద పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఎంఐఎం కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనవరి మాసాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారు. తమిళనాట దాదాపు 25 సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఈ 25 సీట్లలోనూ కమల్ హసన్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒవైసీ నిర్ణయించుకున్నారు.

బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. అయితే వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ హసన్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు.’’ అని ఎంఐఎం వర్గాలు పేర్కొన్నాయి. వెల్లోర్, రాణిపేట్, తిరుపట్టూర్, కృష్ణగిరి, రామనాథపురం, పుడుకొట్టాయ్, తిరుచ్చి, మదురై, తిరునల్వేలీ ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలను ఆధారంగా చేసుకొని ఎంఐఎం తమిళనాట తన ఉనికిని చాటాలని డిసైడ్ అయ్యింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -