end

కొత్త జెర్సీలో టీమిండియా

ఆస్ట్రేలియాతో సిరీస్‌ కు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇది వరకు నైక్‌ జెర్సీతో ఆడిన క్రికెటర్లు.. నైక్‌తో ఒప్పందం ముగియడంతో కొత్త జెర్సీలోకి మారనుంది. తాజాగా బీసీసీఐ.. ఎంపీఎల్‌ స్పోర్స్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో టీమిండియా కిట్‌ స్పాన్సర్‌, వాణిజ్య భాగస్వామిగా ఎంపీఎల్ వ్యవహరించనుంది. ఈ ఒప్పందం నవంబర్‌ 2020 నుంచి 2023 వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సో, మన అభిమాన క్రికెటర్లను ఎంపీఎల్ జెర్సీలో చూడబోతున్నాం.

Exit mobile version