end

ఆలయాల్ని సంరక్షించాలి: పవన్‌

ఆలయ ఆస్తుల్ని సంరక్షించాలి కానీ, అమ్ముకోకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దేవాదాయ భూములకు ప్రభ్వుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి. ఆస్తులను పరిరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలులేదన్నాడు. దీనిపై హైకోర్టు తీర్పు కూడా ఉందన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీటీడీ ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అన్ని ఆలయాలకు.. మఠాల ఆస్తులకు అదే వర్తింపజేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Exit mobile version