end

రోడ్డు పక్కన ల్యాండైన హెలికాప్టర్…

హెలికాప్టర్ చూసి సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనకు దగ్గర ప్రదేశం అంటే అందరూ చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పెనుకొండ హెలికాప్టర్ గురించి తెలియడంతో అక్కడి స్థానికులు చూసేందుకు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై కూడా అక్కడికి వెళ్లారు. తర్వాత విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేట్ భూమిలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. పెనుకొండ సమీపంలోని ఎర్రమంచిలో జాతీయ రహదారి ప్రక్కన హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. విషయం తెలియడంతో హెలికాప్టర్‌ను చూడటానికి భారీగా జనాలు అక్కడికి చేరుకున్నారు. ఉన్నట్టుండి హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో పోలీసులు కంగారుపడ్డారు. స్థానిక కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటరమణ అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అసలు హెలికాప్టర్‌ ల్యాండ్ కావడానికి అనుమతి ఉందా లేదా అని ఆరా తీశారు. టేఫె ట్రాక్టర్స్ ఛైర్మన్ మల్లికా శ్రీనివాసన్ ఆ హెలికాప్టర్ లో వచ్చినట్లు తెలుసుకున్నారు. కియా కార్ల పరిశ్రమ సమీపంలో ఎర్రమంచి పొలంలో ట్రాక్టర్ సంస్థ ఏర్పాటుకు మల్లికా శ్రీనివాసన్ స్థలాని పరిశీలన చేశారు. అందుకే రోడ్డు పక్కన హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. ఆ హెలికాప్టర్‌ని చూడడానికి జనం రావడంతో దాదాపు అరగంట పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కి ఇబ్బంది ఏర్పడింది. తర్వాత పోలీసులు అక్కడి పరిస్థితిని చక్క దిద్దారు.

Exit mobile version