end

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలానికి వచ్చిన మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ కు ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు.రు. 1.65 కోట్లతో దెగుల్వాడి నుండి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవు అనేవారు. కానీ టి ఆర్ ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు మీకు కనిపిస్తాయి. గత 5 ఏళ్లలో రు. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశాం. 54 తండాలు గ్రామ పంచాయతీలు చేశాం. కొత్త బిల్డింగ్ కు 25 లక్షలు శాంక్షన్ చేయబోతున్నాం. మరిన్ని రోడ్లకు బీటీ శాంక్షన్ చేస్తాం. తండాల్లో త్రీ ఫేస్ కనెక్షన్ ఇప్పించాము. 70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాఠశాల లేదు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు గిరిజన పాఠశాల మీకు వచ్చాయి. గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు. మంచినీళ్ళ కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. నీళ్ళు మోసి భుజాలు కాయలు కాసేవి. సీఎం కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారు. రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నాము. కర్ణాటకలో ఏముంది. రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కల్యాణ లక్ష్మి ఉందా అని హరీశ్ రావు ఆడిగారు.

పక్కన కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ఎందుకు 500 పించన్ ఇస్తున్నారు. ఇక్కడి లాగే ఎందుకు 2016 ఇవ్వడం లేదు. కాన్పు కావాలంటే నాడు బీదర్ పోయేవాళ్ళు కానీ ఇప్పుడు కర్ణాటక నుండి ఇక్కడికి వస్తున్నారు. నారాయణ్ ఖెడ్ లో భవిషత్ లో టి డయాగ్నొస్టిక్ తీసుకువస్తాం. తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా మారి పోయాయి. అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తున్నది.
ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. రాష్ట్రంలోని అన్నిగూడెంలు,తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది మన సీఎం గారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులు అయ్యారు. ఎస్టీ సంక్షేమం కోసం బడ్జెట్ లో 600 కోట్లు పెట్టుకున్నాం. అన్ని తండాలకు రోడ్లు వేస్తాము. సీఎం కేసీఆర్ గారికి గిరిజనులు అంటే ఎంతో ప్రేమ. ఎస్టీ సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నారు. గురుకులాలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలంలో రూ. 4.5 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకులం నూతన భవనాన్ని ప్రారంభించిన ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్ రావు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గిరిజన గురుకులంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్. హరీష్ రావు నాడు మాట ఇచ్చాం. ఇప్పుడు నిలబెట్టుకున్నాము. 8 ఏళ్లలో 8 గురుకులాలు తెచ్చి చూపించాం. నేను మాట ఇచ్చా..ఇచ్చిన మాట ప్రకారం గిరిజన విద్యాలయాలు తెచ్చాను. యూత్ సెంటర్ తెచ్చాను.సీఎం కేసీఆర్ కు ఇక్కడి ప్రాంతం పై ప్రత్యేక ప్రేమ. నారాయణ్ ఖేడ్ వెనుకబడలేదు కాంగ్రెస్, టిడిపి వాళ్ళు వెనక్కి పడేశారు.వాళ్ల ఆస్తులు పెరిగాయి కానీ ఇక్కడి ప్రజల బతుకులు మారలేదు. తాగటానికి నీళ్ళు లేవు, చదువుకుందాం అంటే బడులు లేవు. నాడు దారుణమైన పరిస్థితి. తెలంగాణ ఏర్పాటుకు ముందు 91 గిరిజన గురుకులాలు ఉంటే 183 గిరిజన గురుకులాలు పెట్టాము. మహిళా గురుకులాలు తెచ్చాము. సంగారెడ్డిలో రెసిడెన్షియల్ లా కాలేజ్ తెచ్చాము. తాగడానికి నీళ్లు లేని ఇక్కడి పొలాల్లో కాళేశ్వరం నీళ్ళు పరిస్తాం. మీ కాళ్ళు కడుగుతాం. రెండు పంటలు పాండేలా చేస్తాము. నల్లలు ఇప్పితే నీళ్ళు వస్తున్నాయి. నాడు కరెంట్ కోతలు. నేడు నిరంతర కరెంట్ సరఫరా.

డిల్లీ ప్రభుత్వం వడ్లు కొనదు.ఉపాధి హామీ పథకం లేకుండా చేస్తున్నారు. హైదారాబాద్ లో కట్క వొత్తితే మీ బ్యాంకుల్లో రైతు బంధు పైసలు పడుతున్నాయి. అప్పులు లేవు, పైరవీలు లేవు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ నియోజక వర్గంలోనే 100 కోట్లు ఇస్తున్నము. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిస్తున్నము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన సేవలు అందుతున్నాయి.రాబోయే కొద్ది రోజుల్లో అర్హులందరికీ పింఛన్లు ఇస్తాము. రేషన్ కార్డులు కూడా ఇస్తాము. ఇంటడుగు జాగాలో ఇల్లు కట్టుకునేలా సాయం అందిస్తాం. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నారు. ఇక్కడి జిల్లా వారికి 95 ఉద్యోగాలు దక్కుతాయి.

Exit mobile version