end

వారి సేవలు ప్రశంసలకు కూడా అందవు

కుటుంబాలను వదిలి, ప్రాణాలను పణంగా పెట్టి.. దేశ సరిహద్దుల్లో విశేష సేవలు అందిస్తున్న జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా. వారి సేవలను ఎంత కీర్తించినా తక్కువే అవుతుందని రైనా అభిప్రాయపడ్డాడు. ఎక్కడి నుంచి ఏ పెనుముప్పు తమపై విరుచుకుపడుతుందోనని తెలిసి కూడా దేశం బాగుండాలని తమ శాయాశక్తుల కృషి చేస్తారు సైనికులు. దీపావళి పర్వదినాన వారికి మరింత శక్తి సామర్థ్యాలు సమకూరాలని ప్రార్థిస్తున్నట్లు రైనా ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. సైనికులకు, వారి కుటుంబాలకు ఇవే నా శుభాకాంక్షలంటూ రైనా తెలిపాడు. మరోవైపు యావత్‌ భారతావని సైనికులకు దివాళీ శుభాకాంక్షలు తెలుపుతోంది.

Exit mobile version