end

పశువుల మందపై పెద్దపులి పంజా

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మేతకు వెళ్లిన పశువులపై పులి పంజా విసురుతుందని, ఈ ఘటనలో రెండు పశువులు మృతిచెందినట్లు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్దపులి ఎప్పుడు, ఎటునుండి గ్రామంలోకి వస్తుందో అని బిక్కు బిక్కు మంటూ కాలం గడుతుపున్నారు. అయితే గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Exit mobile version